Thursday, May 2, 2024

మ‌ల్కాజిగిరిలో రావ‌ణ‌రాజ్యం పోయి రామ‌రాజ్యం వ‌చ్చింది … మంత్రి మ‌ల్లారెడ్డి

మల్కాజిగిరి లో బి.ఆర్.ఎస్ పార్టీ అధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మల్కాజిగిరి చౌరస్తా లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి లో రావణ రాజ్యం పోయి రామ రాజ్యం వచ్చే రోజు వచ్చిందని మైనంపల్లి ని ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి మంత్రి మలారెడ్డిని ఇప్పటివరకు మల్కాజిగిరి లో అడుగు పెట్టనివ్వలేదు. ఇప్పుడు మైనంపల్లి బి.ఆర్.ఎస్ పార్టీని వీడడంతో ఇన్నాళ్లకు మల్కాజిగిరి లో అడుగుపెట్టాడు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. అల్లుడి తరుపున ఈరోజు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement