Thursday, April 25, 2024

17న బిఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

హైద‌రాబాద్ : తెలంగాణ భ‌వ‌న్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు..ఈ స‌మావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రు కానున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు బిసి బంధు ప‌థ‌కంపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.. అలాగే పోడు భూముల ప‌ట్టాల పంపిణీ పై ఈ స‌మావేశంలో ఒక నిర్ణ‌యం తీసుకోవ‌చ్చంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement