Saturday, May 18, 2024

BRS – కాంగ్రెస్ కు మైండ్ బ్లాక్ – కారు ఎక్కేసిన సీనియర్ నేత ఏర్పుల నరోత్తం

హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏర్పుల నరోత్తం సీఎం కేసీఆర్‌ సమక్షంలో గురువారం బి ఆర్ ఎస్ లో చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ భారాస కండువా కప్పి నరోత్తంను పార్టీలోకి ఆహ్వానించారు.


. వై. నరోత్తం గతంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యే గా పోటీచేసి అతి స్వల్ప మెజారిటీ తో ఓటమి పాలయ్యారు..అనంతరం కాంగ్రెస్ లో చేరి టి నాయకుడు గా నియోజక వర్గంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందనాటులో ఉండి ప్రజా సమస్యలకు పోరాటం చేశారు .కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అ భ్యర్తి రేసులో ఉన్న తను బి ఆర్ ఎస్ లో చేరారు..

- Advertisement -

ఈ సందర్భంగా నరోత్తం మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జహీరాబాద్ నియోజక వర్గ మేలు కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో పార్టీ లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. వారి మార్గదర్శకత్వంలో పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement