తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత రెడ్డి, భర్త గొంగిడి మహేందర్ రెడ్డి పై రాళ్ల దాడి జరిగింది. మహేందర్ రెడ్డి కింద పడ్డాడు. కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/11/image-212-576x1024.png)