Thursday, May 2, 2024

BREKING: విరిగిన రైలు ప‌ట్టా… కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన ప్రమాదం..

యాదాద్రిలోని ఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్ర‌మాదం తప్పింది. ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగింది. ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విచిత్రమైన శబ్దం రావడంతో గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

- Advertisement -

ఈ తరుణంలోనే ట్రైన్ ఆపారు రైల్వే అధికారులు. ఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పైన రైల్ పట్టా విరిగిపోవడంతో గమనించి మరమ్మతులు చేశారు అధికారులు. రిపేర్ అనంతరం కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement