Saturday, May 4, 2024

Breaking News – మావో అగ్రనేత రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి…?

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ సాయన్న అలియాస్ మీసాలన్న అలియాస్ అలోక్ అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అటు మావోయిస్టు పార్టీ కానీ ఇటు పోలీసులు కానీ రాజిరెడ్డి మృతి పై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సాగర్, అశోక్, దేశ్‌పాండే ప్రస్తుతం కేంద్ర క కమిటీ సభ్యుడుగా పనిచేస్తున్నారు.

2009లో రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా 2013లో విడుదల కాగానే తిరిగి అజ్ఞాతం లోకి వెళ్ళాడు. ప్రస్తుతం రాజిరెడ్డి వయస్సు 70 సంవత్సరాలు. రాజిరెడ్డిపై కోటిరూపాయల నజరానా ఉంది. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా దండకారణ్యంలో రాజిరెడ్డి మావోయిస్టు పార్టీలో అతికిలకంగా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement