Monday, May 6, 2024

Breaking : కోమ‌టిరెడ్డి నివాసంలో ముగిసిన లంచ్ మీట్ – 70నుండి 80సీట్లు గెల‌వ‌డ‌మే టార్గెట్

కోమ‌టిరెడ్డివెంక‌ట‌రెడ్డి నివాసంలో లంచ్ మీట్ ముగిసింది. కాగా ఈ విందులో పాల్గొన్నారు మాణిక్కం ఠాగూర్..బోసురాజు..మిష‌న్ తెలంగాణ మొద‌లైంద‌న్నారు కోమ‌టిరెడ్డి. ఒక్క‌రితో పార్టీ అధికారంలోకి రాద‌న్నారు. పీఏసీ స‌భ్యుల్ని 12కి త‌గ్గిస్తామ‌న్నారు కోమ‌టిరెడ్డి..త్వ‌ర‌లో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తామ‌న్నారు. తెలంగాణ‌లో 70సీట్లు సాధిస్తామ‌న్నారు.అధికార పార్టీ నుంచి చేరిక‌లుంటాయన్నారు. ష‌ర్మిల పార్టీ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌న్నారు. తెలంగాణ‌లో ప్రియాంక‌గాంధీ ప‌ర్య‌టించాల‌న్నారు కోమ‌టిరెడ్డి. 70నుండి 80సీట్లు గెల‌వ‌డ‌మే టార్గెట్ అన్నారు. కాగా తెలంగాణ మిష‌న్ గురించే చ‌ర్చించాం అన్నారు మాణిక్కం ఠాగూర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement