Wednesday, May 1, 2024

విధిగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి.. గవర్నర్‌ తమిళిసై పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కరోనా వైరస్‌ ఇప్పటికీ ప్రమాదకరస్థితి లో వ్యాప్తి చెందుతున్నందున ప్రతీ ఒక్కరూ విధిగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ త మిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో నిర్వహించిన హర్‌ఘర్‌ తిరంగ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

రాజ్‌భవన్‌ ఉద్యోగులకు జాతీయ జెండాలతోపాటు దుస్తులను పంపిణీ చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ నెల 13 నుంచి 15 తేదీ వరకు ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బిడ్డకు చనుబాలు పట్టించే విషయంలో ప్రతీ తల్లి అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ విషయంలో వైద్యులు తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement