Friday, May 3, 2024

TS: ఎవరేం చేసినా గెలుపు బీజేపీదే… ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌…

ఎవరేం చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ఎంపీ ల‌క్ష్మ‌ణ్ జోస్యం చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కేసులు, చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయని అన్నారు. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో విసిగిపోయి కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల వేళ మునిగిపోయే నావ అయినటువంటి కాంగ్రెస్‌తో కలిసి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే క్లారిటీతో అంతా మెల్లగా కూటమి నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ది గాలివాటం గెలుపు అని సెటైర్లు వేశారు. మోసపూరిత హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

- Advertisement -

ఇక, తెలంగాణ‌లో పది సీట్లు గెలవడంతో పాటు మొత్తం 17 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పనిఅయిపోయినట్లే అని అన్నారు. తాము బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం ఎప్పటికీ జరుగదని అన్నారు. కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు నో అంటామని చెప్పారు. రేపటినుంచి రాష్ట్రంలో బీజేపీ బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement