Sunday, April 28, 2024

Delhi: భారీగా బంగారం పట్టివేత..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో మరోసారి భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీలు చేయగా.. రూ. 4.5 కోట్ల విలువైన 8 కిలోల బంగారం పట్టుబడింది. దీంతో పట్టుబడిన బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారు. అనే విషయాలు విచారణలో బయటపడనున్నాయి. ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement