Sunday, April 28, 2024

27న ”బిజెపి నిరుద్యోగ దీక్ష”

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈనెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద ”బిజెపి నిరుద్యోగ దీక్ష”.చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే బండి సంజయ్ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలని… నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. అయితే ఉద్యోగాలను భర్తీ చేయాలని 27న నిరుద్యోగ దీక్ష చేపడుతున్న విషయాన్నికూ యాప్ ద్వారా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement