Tuesday, May 21, 2024

తెలంగాణలో ఇక బిజెపి రథయాత్రలు

హైదరాబాద్ – తెలంగాణ లో అధికార పీఠం దక్కించు కోవాలని భావిస్తున్న బిజెపి తన ట్రంప్ కార్డ్ హిందుత్వ అజెండా ను బయటకు తీసింది. ఇప్పటి వరకూ నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర స్థానంలో రథయాత్రలకు సన్నద్ధమవుతోంది.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటివరకు ఐదు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఆరో విడత పాదయాత్రకు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించారు. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రథయాత్ర చేపట్టాలని బిజెపి నిర్ణయించింది. దీనికోసం ఐదు రథాలను సిద్ధం చేయిస్తోంది. ఏప్రిల్‌ తొలి వారంలో పార్లమెంట్ల వారీగా రథయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్‌లోని ఒక్కో అసెంబ్లీ నియోజవర్గంలో ఒక్కో రోజు యాత్ర చేపట్టేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తోంది. పార్లమెంట్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్‌ రథయాత్రల్లో పాల్గొనేలా యాత్రకు రూపకల్పన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement