Saturday, April 27, 2024

కేసీఆర్ దొంగ దీక్ష.. తెలంగాణ యాద్ మర్వలే..

దళితుల కోసం చివరి రక్తపుబొట్టు వరకూ సేవ చేస్తా అన్న సీఎం కేసీఆర్ ప్రకటన కన్నా హస్యాస్పదమైన అంశం ప్రస్తుతం మరొక్కటి ఉండదని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ‘’దళిత ముఖ్యమంత్రి పదవి గుంజుకుని… దళిత డిప్యూటీ సీఎంలను అవమానకరంగా వెళ్ళగొట్టి… 3 ఎకరాల భూమి అంటూ మోసగించి… డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎగ్గొట్టి… నిరుద్యోగభృతికి సున్నా చుట్టి… ఇప్పుడు ఏడేళ్ళ కాల పరిపాలనల దళితుల పట్ల సర్వ ద్రోహాలకూ పాల్పడ్డ ఈ దొర ముఖ్యమంత్రిగారు, హుజురాబాద్ భయంతో అనేక అసత్యాలు మాట్లాడుతున్నారు. ఇంకా, చావు నోట్ల తల బెట్టి తెలంగాణ తెచ్చిన… అన్న అబద్ధం వారు చెప్పకుంటే మేలు. ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారి దొంగ దీక్ష ఖమ్మం హాస్పిటల్… ఇంకా నిమ్స్‌ల నడిచింది 2009ల… ప్రజా ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది 2014ల… ఆనాటి హాస్పిటళ్ళలో కేసీఆర్ గారు తీసుకున్న ఆహార జ్యూస్‌లు, ఓయూ నుంచి విద్యార్థి సంఘాల హెచ్చరికలు, ఇంకా ఐవీ ఫ్లూయిడ్‌లు, దీక్ష విరమణకై ప్రభుత్వాన్ని బతిమాలుకున్న అంశాల్ని ఇంకా తెలంగాణ సమాజం యాద్ మర్వలే’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః ఏపీలో పదో తరగతి ఫలితాల్లో కీలక మార్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement