Monday, May 6, 2024

BJP – కార్యకర్తలే పార్టీకి వెన్నెముక …ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)27: బీజేపీపార్టీ కి కార్యకర్తలే పునాదులని..కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని అర్బన్ శాసనసభ్యుడు ధన్ పాల్ సూర్యనా రాయణ పేర్కొన్నారు. కమలం జెండా కోసం అహర్నిశలు పని చేసి నాకోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలిపారు. బుధవారం నిజామాబాదు నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం లో భారతీయ జనతా పార్టీ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తలతో కృతజ్ఞతసభ నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మి నారాయణ, రాష్ట్ర కార్య దర్శి పల్లె గంగారెడ్డి జిల్లా అధ్య క్షుడు బస్వా లక్ష్మి నరసయ్య హాజరయ్యారు. ఈ కార్యక్ర మాన్ని ఉద్దేశించి ధన్ పాల్ మాట్లాడుతూ అహర్నిశలు పని చేసి నాకోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు నా గెలుపులో పెద్ద సంఖ్యలో పనిచేయడం జరిగిందన్నారు. నా గెలుపు కు ముఖ్య కారణం ప్రతి బూత్ కార్యకర్త అన్నారు. మనమంతా ఒక కుటుంబ సభ్యులం అన్నారు మీ కష్టాల్లో నష్టాల్లో భాగస్వామి అవుతా. నా గెలుపు లో ఎంతో మంది కార్యకర్తలు స్వచ్చందగా పనిచేయడం జరిగిందన్నారు. ఇందూరు అంటే బీజేపీ మాత్రమే అని ప్రజలకు గుర్తిండెలా పని చేస్తాన‌ని, తాను స్థానికంగా అందరికి అందు బాటులో ఉంటూ మీకు చిన్న సమస్య వచ్చిన మీకు అండగా నిలబడుతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, వెంకటేష్, స్వామి యాదవ్,బంటు రాము,బుస్సు పూర్ శంకర్,కైసార్, రాజశేఖర్ రెడ్డి,సుక్క మధు, గడ్డం రాజు, రోషన్ లాల్ బోర, పుట్ట వీరేందర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement