Wednesday, May 1, 2024

BJP – నేడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌లో అమిత్ షా ప్ర‌చారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిఘట్టానికి చేరుకుంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందు కోసం బీజేపీ పార్టీలకు చెందిన జాతీయ నేతలను రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇవాళ కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నేడు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. ఇవాళ కొల్లాపూర్‌, మునుగోడు, పటాన్‌చెరులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌సంగిస్తారు.. సాయంత్రం ఖైరతాబాద్‌లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement