Sunday, April 28, 2024

AP: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

శ్రీ సత్య సాయి బ్యూరో, నవంబర్ 25(ప్రభ న్యూస్) : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జబీన్ అనే 26 ఏళ్ళ బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని బ్యాటరీ అంజాద్ తన కుమార్తె జబీన్ కాన్పు నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే వైద్యులు నిర్లక్ష్యం వహిస్తూ రావడంతో తమ కుమార్తె మృతి చెందిందని వాపోయాడు. కేవలం వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమార్తె మృతి చెందిందని ఆరోపించారు. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కదిరి-గోరంట్ల మధ్య, అదేవిధంగా కదిరి-హిందూపురం మధ్య ఇంకా గోరంట్ల-బెంగళూరు మధ్య రవాణా స్తంభించింది. గోరంట్ల పోలీసులు సంఘటన గురించి తెలుసుకుని, బాధితులను కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement