Thursday, May 9, 2024

Nizamabad- సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం..అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)7:సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, నిజామాబాద్ అభివృద్దే లక్ష్యం గా పని చేస్తున్న బి.ఆర్.ఎస్ పార్టీకి మరోసారి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల కోరారు. సోమవారం 24వ డివిజన్ గాయత్రి నగర్ లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ లో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎమ్మెల్యే గణేష్ బిగాల కి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల గారు మాట్లాడుతూ. సమైక్య పాల నలో విధ్వంసానికి గురైన తెలం గాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పథంలో ముందుకు తీసు కెళ్తున్నారు.2014 ముందు నిజామాబాద్ నగరం అభివృద్ధి కి ఆమడ దూరం లో ఉన్న మా ట వాస్తవమని తెలిపారు. బి.ఆ ర్.ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత నిజామా బాద్ నగరం సుందరంగా మార్చామన్నారు. మౌళిక సదుపాయలకు ప్రాధాన్యతని ఇస్తూ ప్రతి కాలనీ లో రోడ్లు,డ్రైనేజి లు నిర్మాణం చేసామన్నారు.మిషన్ భగీరథ ద్వార మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేసి ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నామన్నారు.నాటి పాలనలో స్మశాన వాటిక లో సౌకర్యాల లేమి తో ఇబ్బందికర పరిస్థితులు ఉండేవన్నారు.

నేడు ఆధునిక సదుపా యాలతో వైకుంఠ దామలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ , మాజీ కార్పొరేటర్ యెనుగందుల మురళి,గుజ్జెటి వెంకట నర్సయ్య,SR సత్య పాల్,ధర్మపురి, కస్తూరి గంగ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement