Saturday, May 4, 2024

Bhupalapalli – ఏసీబీకి చిక్కిన జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి మేనేజర్ గంగాధర్ శ్రీనివాస్

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 19 (ప్రభ న్యూస్) – జయశంకర్ భూపాలపల్లి , ములుగు జిల్లాల జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడ్డారు. ములుగు జిల్లా దగ్గర శ్రీనగర్ కు చెందిన గుగులోతు లచ్చిరాం పరిశ్రమల శాఖ నుండి గత సంవత్సరం రూ.53 లక్షల విలువచేసే అశోక్ లారీని సబ్సిడీపై తీసుకున్నాడు.

23 లక్షల సబ్సిడీని రిలీజ్ చేసేందుకు రూ.1,10,000 డిమాండ్ చేశారు. అందులో గతంలో 50 వేలు అందించాడు.. ఈ విషయాన్ని ఎసిబికి తెలిపాడు.. దీంతో నేడు 15000 ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా కార్యాలయంలో ఏసీబీ డిఎస్పి సాంబయ్య, ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్ ,రవి, శ్రీనివాసులు పట్టుకున్నారు . డబ్బులు రికవరీ చేసి ఏసిబి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement