Saturday, May 18, 2024

శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే: భట్టి

దేశంలోని అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురాగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న భట్టి… శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఉద్ఘాటించారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి హాజరైన భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా సరిపోరని తెలిపారు. ప్రధాన మంత్రి పదవి తన ముందు నిలిచినా వద్దనుకున్న త్యాగమూర్తి సోనియా గాంధీ అని గుర్తు చేశారు వివరించారు. దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, గాంధేయవాదమే కాంగ్రెస్ భావజాలమని స్పష్టం చేశారు. దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో చిక్కుకుందని తెలిపారు. దేశాన్ని ఓవైపు బీజేపీ పట్టిపీడిస్తుంటే, మరోవైపు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ దోచుకుంటోందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని భట్టి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement