Thursday, April 25, 2024

భోథ్ నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న భ‌ట్టి మహాపాద‌యాత్ర ..

అదిలాబాద్ – ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా, హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క గారు ప్రజాసమస్యలపై చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడో మండలం కేంద్రం నుండి మాధపూర్, సిరికొండ మండలం వైపు రెండవ రోజు విజయవంతం గా కొనసాగుతున్నది. పీపుల్స్ మహా పాదయాత్ర లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు కల్తి వెంకట్, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాద‌యాత్రంలో భ‌ట్టి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తే ఏ ఏ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌నుందో వివ‌రిస్తున్నారు.. భ‌ట్టి మ‌హాపాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌నిపిస్తున్నది..

Advertisement

తాజా వార్తలు

Advertisement