Tuesday, May 7, 2024

మాజీ ప్ర‌ధాని పీవీకి భార‌త ర‌త్న ఇవ్వాలి.. జ‌యంతిలో పాల్గొని నివాళుల‌ర్పించిన మంత్రులు

మాజీ ప్రధాని PV నర్సింహా రావు జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని PV ఘాట్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ PVని కేంద్రం విస్మరించడం బాధాకరం అన్నారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన PVకి భారత రత్న ఇవ్వాలని కోరారు.

ప్రపంచ దేశాలకు భారత ఖ్యాతిని చాటి చెప్పిన PVని గౌరవించకపోవడం విచారకరం అని, PV శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం గౌరవించింద‌ని గుర్తు చేశారు. మన మధ్య భౌతికంగా ఆయ‌న లేకపోయిన.. ప్ర‌జ‌ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి PV నర్సింహా రావు అని కొనియాడారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement