Sunday, May 19, 2024

Breaking | బీసీ గురుకుల విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. నిజామాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌

నిజమాబాద్ జిల్లా బాల్కొండలో ఇవ్వాల (శ‌నివారం) సాయంత్రం ఘోరం జ‌రిగింది. బీసీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే పాఠశాలలోని పైఅంతస్థు నుంచి 8వ తరగతి విద్యారథిని కిందికి దూకేసింది. దీంతో తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే ఆ బాలికను 108 వాహ‌నంలో ఆర్మూర్ హాస్పిటల్ కు త‌ర‌లించారు. కాగా, ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ స్టూడెంట్‌ని ఫతేనగర్ కు చెందిన బాలిక‌గా గుర్తించారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందనే విషయమ్మీద కార‌ణాలు తెలియ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement