Friday, May 3, 2024

KNR: బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం..

కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజలు చేశారు. ప్రజాహిత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న హోమం వద్దకు వెళ్లి కంకణం కట్టుకున్నారు బండి సంజయ్. అలాగే తన నివాసానికి వెళ్లి మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.

తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement