Sunday, May 19, 2024

మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై బండి సంజ‌య్ కౌంట‌ర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… డబ్బాలో రాళ్లేసి ఊపినట్లు మాట్లాడుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా…. డబ్బాలో కాదు.. డ్రమ్ములో రాళ్లేసే వాడి గురించి మాట్లాడను అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. వాడు, వీడు ఏదో మాట్లాడితే పట్టించుకోనన్నారు. అవినీతి అక్రమాలతో ఏమీ సాధించలేమని తెలిపారు. హిందూ ధర్మాన్ని హేళన చేయడం ఫ్యాషన్ గా మారిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో పాలిస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని బండి సంజ‌య్ హెచ్చరించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement