Wednesday, May 1, 2024

Challenge – వంద‌ల కోట్ల ఆస్తా…నిరూపించుః రేవంత్ రెడ్డికి బాల్క సుమ‌న్ స‌వాల్

చెన్నూరు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోవాలని చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన వద్ద రూ.వందల కోట్లు ఉన్నట్లు ఆరోపించిన రేవంత్ రెడ్డి.. తన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఓయూలో విద్యార్థి నాయకులను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ, వారికి టికెట్ ఎందుకు ఇవ్వలేదని బాల్క సుమన్ నిలదీశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా సీట్లలో గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కోసం తన ఇంటిని వెంకటస్వామి ఇస్తే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్ధీవ దేహాన్ని కూడా పార్టీ ఆఫీసులోకి రానివ్వలేదని బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ట్యాంక్ బండ్ మీద వెంకటస్వామి విగ్రహం పెట్టించారని గుర్తు చేశారు. రేటెంత రెడ్డికి రూ.వందల కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కుని అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ వివేక్ పోటీకి దిగారని ఆరోపించారు. వివేక్, వినోద్ గెలిస్తే ప్యూడిలిస్ట్ పాలన వస్తుందని మండిప‌డ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement