Monday, April 29, 2024

TSPSC పేపర్ లీక్ కేసులో 8 మందికి బెయిల్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని కోర్టు పేర్కొంది. సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించింది. నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే నాంపల్లి కోర్టు ఈ కేసులో రేణుకకు, మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement