Sunday, April 28, 2024

MDK: సీఎం పర్యటనను అడ్డుకునే యత్నం.. కాంగ్రెస్ నేత రాజిరెడ్డి అరెస్ట్

కౌడిపల్లి, ఆగస్టు 23, ప్రభ న్యూస్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాకు వస్తున్న తరుణంలో పర్యటనకు వ్యతిరేకంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కౌడిపల్లిలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద జాతీయ ప్రధాన రహదారి రోడ్డుపై ఈ రోజు 11 గంటలకు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో పర్యటించే అర్హత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని పర్యటనను అడ్డుకోవడానికి రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎస్సై శివప్రసాద్ రెడ్డి పోలీసులతో వచ్చి ఆవుల రాజిరెడ్డిని అరెస్టు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement