Sunday, April 28, 2024

TS | రాళ్ల దాడి.. ఏటీఎంలను పగలగొట్టిన దుండగులు!

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని పలు బ్యాంకుల ఏటీఎంలపై రాళ్ల దాడి చేసి పగలగొట్టారు. పట్టణ కేంద్రంలోని ద్వారకపేట రోడ్డులో ఉన్న ఎస్బీఐకి చెందిన ఏటీఎం.. వరంగల్ రోడ్డులో ఉన్న హెచ్డిఎఫ్సి కి చెందిన ఏటీఎంపై దుండగులు రాళ్ల దాడికి యత్నించారు. ఈ దాడిలో ఏటీఎంల డిస్ప్లే లు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడికి యత్నించిన వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది దోపిడీ కోస‌మా.. లేక కావాల‌నే క‌క్ష్య పూరితంగా చేశారా అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement