Saturday, May 4, 2024

Telangana: పార్ల‌మెంట్ న‌మూనాలో అసెంబ్లీ…సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ నమూనాలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. శాసన సభ, శాసన మండలి ఒకేచోట ఉంటాయని తెలిపారు. శాసన సభ, మండలి మినహా మరే ఇతర భవనాలు అసెంబ్లీ ప్రాంగణంలో స్పష్టం చేశారు. ఇప్పుడు ఉన్న చెట్లను తొలగించకుండా మరింత గ్రీనరీ పెంచవలసి ఉందన్నారు.

అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైల్వే గేట్‌కు ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ ఎత్తు పెంచవలసి ఉందన్నారు. సభ్యులు ఉదయం పూట వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement