Monday, April 29, 2024

Asifabad – రైల్లో గొలుసు దొంగ – దేహశుద్ధి చేసిన ప్రయాణికులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. హైదరాబాదు నుండి కాగజ్ నగర్ కు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికురాలు మెడలో నుండి బంగారు గొలుసును చోరీకి ఎత్నించగా ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకొని దేహాశుద్ధి చేశారు.ఈ ఘటన కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ఫారం పై జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి రైల్వే పోలీసులు ప్రయాణికుల కథనం ప్రకారం సికింద్రాబాద్ నుండి కాగజ్ నగర్ కు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైల్లో కాగజ్ నగర్ నివాసి పద్మ వస్తున్నారు, రైలు కాగజ్ నగర్ వచ్చేసరికి ఆమె కూర్చున్న భోగిలో పద్మ మాత్రమే ఉండగా మరో వైపు పక్కన వ్యక్తి కూర్చోనున్నారు. రైలు ప్లాట్ ఫామ్ కు వస్తున్న క్రమంలోనే ఆ వ్యక్తి పద్మ మెడలో నుండి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని రైలు దూకి పారిపోతుండగా బాధ్యతరాలు కేకలు వేసింది. ప్రయాణికులు, మారుతి నగర్ కాలనీవాసులు అప్రమత్తమై పట్టుకొని దేహాశుద్ధి చేశారు

.ఆ వ్యక్తి పెద్దపెల్లి రఘు (శ్రీనివాసి) గా తేలింది. ఈమెరకు రైల్వే పోలీసులు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement