Monday, May 6, 2024

Accident – ఇసుక లారీ ఢీ – తండ్రి కొడుకులు మృతి

.మానకొండూరు మండలం రంగపేట శివారులో లారీ ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన మానకొండూరు మండలం లో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు వివరాలు ప్రకారం..వివరాలు తండ్రి కొడుకులైనటువంటి ధర్పల్లి మొగిలి, సాయి చందు లు కరీంనగర్ నుండి ఆటోలో మామిడాలపల్లి కి వస్తున్నారు. సరిగ్గా రంగపేట శివారుకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మామిడాలపల్లి నుండి వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే తండ్రి కొడుకులు మృతి చెందారు.

దరిపెల్లి మొగిలి భార్య ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆరు నెలల క్రితం నుండి ఆసుపత్రిలో ఉంటుంది. రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చారు. భార్యకు చంటి పాపకు కావలసినటువంటి సామాన్లు ఆటోలో తీసుకెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement