Sunday, April 28, 2024

Appeal – న్యాయం చేయండి – సిఎంకు ఆర్టీసీ ఉద్యోగుల మొర

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని… తమ గోడును సీఎంకు చెప్పుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు. చిన్న చిన్న‌ కారణాలతో దాదాపు 1,500 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కాగా, రేవంత్ ఇంటి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి మాత్ర‌మే అనుమతిని ఇచ్చారు. అనంత‌రం వారు రేవంత్ త‌మ గోడును వినిపించారు.. దీనికి రేవంత్ సానుకూలంగా స్పందించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement