Monday, April 29, 2024

Medchal: కొడుకు బర్త్‌డే చేయడం లేదని… తల్లి ఆత్మహత్య

కొడుకు బర్త్‌డే గ్రాండ్ గా చేయ‌డం లేద‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని పేట్ బషీరాబాద్‌లో చోటుసుకుంది. కొడుకు బర్త్ డే ఫంక్షన్ చేయడం లేదనే కారణంతో తల్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పేట్ బషీరాబాద్‌లోని సుభాష్‌ నగర్‌లో నరసింహారెడ్డి, నాగ సత్యవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

అయితే మరికొన్ని రోజుల్లోనే చిన్న కుమారుడి పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా ఓ బంగారు గొలుసు చేయించి ఫంక్షన్ గ్రాండ్ చేద్దామని భర్త నరసింహారెడ్డిని భార్య సత్యవేణి కోరింది. అందుకు భర్త తర్వాత చూద్దామని చెప్పగా, తీవ్ర మనస్తాపానికి గురైన సత్యవేణి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement