Sunday, May 5, 2024

Anantagiri – పిడుగుపాటుకు 15 మేకలు మృతి

అనంతగిరి సెప్టెంబర్ 26(ప్రభ న్యూస్): పిడుగుపాటుకు గురై 15 మేకలు మృతి చెందిన సంఘటన మండలంలోని వెంకట్రామపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జెనిగల రంగయ్య తమ మేకలను గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మేతకు తీసుకెళ్లారు. ఈక్రమంలో వర్షం కురవడంతో చెట్టు క్రిందకు వెళ్లగా పిడుగు పడింది. దీంతో 15 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. సుమారు రూ. 2 లక్షలమేర నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. చనిపోయి విగతజీవులుగా పడివున్న మూగజీవాలను చూసి యజమాని కన్నీరు పెట్టడం పలువురిని కలిచివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement