Sunday, April 28, 2024

TS: ప‌రీక్ష‌కు వెళ్తున్న విద్యార్ధినికి యాక్సిడెంట్… మాన‌వ‌త్వం చాటుకున్న ఇన్ స్పెక్ట‌ర్

హైదరాబాద్‌: పరీక్షలు రాసేందుకు వెళ్తూ… రోడ్డు ప్రమాదానికి గురైన ఇంటర్ విద్యార్థినికి ప్రథమ చికిత్స అందించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి మంచితనం చాటుకున్నారు మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు నగరానికి చెందిన విద్యార్థిని తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది.

సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్‌ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బైక్‌ అదుపుతప్పడంతో వారు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉపాశంకర్‌ స్పందించి వెంటనే తన వాహనంలో దగ్గర్లోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి తిరిగి సరైన సమయంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. మానవత్వం చాటుకున్న ఇన్‌స్పెక్టర్‌కు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement