Wednesday, May 1, 2024

బండి సంజయ్ కి అమిత్ షా ఫోన్… హుజూరాబాద్ ఫలితంపై అభినందనలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అభ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సరళిని అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఖాతాలో చేరుతోందని బండి సంజయ్ ఆయనకు తెలిపారు. కార్యకర్తలు తీవ్రంగా శ్రమించడం వల్లే హుజూరాబాద్ లో బీజేపీ విజయపథంలో పయనిస్తోందని వివరించారు. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండడం పట్ల అమిత్ షా ముందస్తు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement