Friday, April 26, 2024

అంబేద్క‌ర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాల్క సుమ‌న్

భీమారం : ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : ఉమ్మడి మండలం జైపూర్ గురుకుల పాఠశాలలో ఈ రోజు పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్రహంను చెన్నూర్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ పార్లమెంట్ సభ్యులు పెద్దపెల్లి వెంకటేష్ నేత, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మిలతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల అభివృద్ధికై ఇందులో జైపూర్ గురుకులంకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నామని, అలాగే చెన్నూర్ బాలికల గురుకుల హాస్టల్ కు జాతీయ రహదారి నుండి సీసీ రోడ్ కు రూ.25 లక్షలు, రామక్రిష్ణపూర్ గురుకులం కు రూ.25లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ స్వరూపరాణి, ప్రిన్సిపాల్ లు బాల భాస్కర్, ఏఆర్ సీఓ ఉమా మహేశ్వర్ రావు, జిల్లా పరిషత్ గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement