Friday, May 3, 2024

ఊర కుక్కల హల్ చల్ – భ‌యం గుప్పెట్లో ప్ర‌జ‌లు

ఆలూర్ మండలం ప్రభ న్యూస్ – .నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని బుధవారం ఉదయం ఊర కుక్కలు ఒక పంది పిల్లని వెంటాడి చంపి తింటున్నాయి . గతంలో చిన్న పిల్లలపై పెద్దలపై దాడి చేశాయి కావున ఈ ఊర కుక్కల ప్రభావంతో చిన్న పిల్లలు ఉంటే మళ్లీ అలానే జరిగే అవకాశాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో బైక్ పై వెళుతున్న ప్రయాణికులను కరవడానికి వెంబడిస్తున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

అలా జరగకుండా దీనిని వీలైనంత తొందరగా చొరవ తీసుకొని గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ సర్పంచ్ లు కుక్క‌ల బెడ‌ద‌ను పరిష్కరించాలని ప్ర‌జ‌లు కోరుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement