Friday, May 17, 2024

TS | ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి చొరవ చూపండి : మైనంపల్లి రోహిత్

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అభివృద్ధికి చొరవ తీసుకోవాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ… మెదక్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు. ఏడుపాయల దుర్గామాతను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని.. వారికి తాత్కాలిక మౌలిక సదుపాయాలకు బదులు శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించానని ఆయన పేర్కోన్నారు. తన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించరాని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా మెదక్ ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement