Sunday, April 28, 2024

Delhi : ఏఐసీసీ ఓబీసీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా వేణు…

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్ నేత నందిమండలం వేణును ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ సమన్వయకర్తగా ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఓబీసీ విభాగం ఛైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్‌ను నేషనల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ కర్ణాటక రాష్ట్ర ఇంచార్జి బాధ్యతల్ని కూడా అప్పగించారు.

- Advertisement -

ఈ నిర్ణయం పట్ల వేణు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతల్ని పూర్తిస్థాయిలో నెరవేరుస్తానని వేణు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement