Monday, April 29, 2024

మూడేళ్లు కుంభ‌క‌ర్ణుడిలా ప‌డుకొని ఇప్పుడు హుడావుడి : ఈట‌ల‌

కేసీఆర్‌ నేను రాజును నాకే అన్నీ తెలుసు.. నేను చెప్పిందే చేయాలి అని హుకుం జారీ చేస్తున్నారని, 3 సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఇవాళ‌ సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతుల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత‌మై.. ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్‌ ఇప్పుడు పరుగులు పెడుతున్నారన్నారు. జీవో 317 ఉద్యోగుల, టీచర్లకు కునుకు లేకుండా చేసిందని, వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. చిక్కుముడులు, అపోహలు, అనుమానాలన్నీ నివృత్తి జరిగేలా చర్చలు జరపాలన్నారు. అప్పటివరకు ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ ఉద్యమంలో చెప్పిన‌వి.. సీఎం అయ్యాక మర్చిపోయారా ? అని ఆయన ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement