Sunday, April 28, 2024

MDK: శ్రీనివాస పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్… నిలదీసిన వాహన యజమానులు…

చేర్యాల: చేర్యాల పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపులో ఈరోజు ఉదయం వీరన్నపేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు దండ బోయిన బాబురావు, ఎల్లసాని నరహరి, పోకల పరశురాములు, గౌండ్ల వెంకటేష్, పోన్నబోయిన నరేష్ లు వరి నాట్లు వేసేందుకు పొలం దున్నడానికి ట్రాక్టర్ లలో డీజిల్ పోయించుకున్నారు. పొలాల్లోకి వెళ్లి పనులు చేస్తుండగా ట్రాక్టర్లు మధ్యలోనే మొరాయిస్తుండడంతో ట్రాక్టర్ యజమానులు కల్తీ డీజిల్ వేసారని గమనించి పెట్రోల్ పంపు యజమాని వద్దకు వచ్చి నిలదీశారు.

మొదట విషయం ఎవరికీ చెప్పకు 3000 రూపాయలు ఇస్తానని అనడంతో ట్రాక్టర్ యజమాని తన ట్రాక్టర్ రిపేరు చేయడానికి 70,000 ఖర్చు అవుతుందనీ అనడంతో పెట్రోల్ పంపునకు తాళం వేసుకొని వెళ్లిపోయారు. దాదాపు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్టర్లు, ఆటోల యజమానులు ఇక్కడే పెట్రోల్ పోయించుకుంటున్నారని, తమ బండ్లు మార్గమధ్యలోనే ఆగిపోయాయని పెట్రోల్ పంపు వద్దకు ఒక్కొక్కరు చేరుకున్నారు. దాదాపు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు పంపు వద్దకు చేరుకున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వాహనాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement