Monday, April 29, 2024

బీ-ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్‌ఎఫ్‌ఏయూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణలోని పది కాలేజీల్లో 830 బీ-ఆర్కిటెక్చర్‌ సీట్ల భర్తీకి ఈమేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బుధవారం నుంచి ఈనెల 22 వరకు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 23 నుంచి 31 వరకు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. ఆగస్టు 5,6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లకు గడువిచ్చారు. ఆగస్టు 8న ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మిగితా సీట్లకు ఆగస్టు 13, 14 తేదీల్లో రెండో విడత వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement