Sunday, April 28, 2024

బాసర అమ్మవారి ఆల‌య ప‌రిస‌రాల్లో అప‌రిశుభ్ర‌త‌

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పరిసర ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులకు గుడి పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ చెత్తను తిని మూగ‌జీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయి. చెత్త ప్ర‌భావంతో ఆల‌య ప‌రిస‌రాల్లో దోమ‌లు విప‌రీతంగా పెరిగాయి. ఎప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించలని భక్తులు స్థానికులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement