Sunday, April 28, 2024

TS – పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం – సీతక్క

జన్నారం, ( ప్రభ న్యూస్): పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయమని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, సింగరాయిపేట, తపా ల్ పూర్ గ్రామాలలో శనివారం ఉదయం ఇంటింటా తిరుగుతూ ఆమె ప్రచారం నిర్వహించారు. రాంపూర్ లో చెరువు వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కూలీల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పల్లెల అభివృద్ధి చెందాయంటే కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వంమేనని ఆమె చెప్పారు. బిజెపి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాల వస్తువులపై ధరలు పెరిగాయని ఆమె అన్నారు. రాముని పేరుతో దేశాన్ని విభజించి బిజెపి ఓట్లు అడుగుతుందన్నారు .

బిజెపి,బిఆర్ఎస్ పాలనలో దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని ఆమె విమర్శించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ ను చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే, రాహుల్ గాంధీని ప్రధాని చేసినట్లేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, మండల కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement