Sunday, April 28, 2024

జీవో నెంబ‌ర్ 76 ద్వారా.. 500 మందికి పట్టాల పంపిణీ..

బెల్లంపల్లి ఏప్రిల్ 10 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలో గత కొంతకాలంగా నివాసముంటున్న వారికి జీవో నెంబ‌ర్‌ 76 ద్వారా అర్హులైన 500 మందికి సోమవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన పట్టాలను అందించారు. బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విటల్, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ సంతోష్ ల చేతుల మీదుగా పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఆర్డీవో శ్యామలాదేవి, తాసిల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement