Saturday, May 4, 2024

బాస‌ర ట్రిపుల్ ఐటీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. సీపీఐ నారాయ‌ణ అరెస్ట్

నిర్మ‌ల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలలో ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు విద్యార్థులకు మద్ధతు ప్రకటించడానికి బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన సీపీఐ నేత నారాయణను, విద్యార్థి సంఘాల‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా సీపీఐ నాయకులు నినాదాలు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలోకి ఎస్ఎఫ్‌ఐ నేతలు దూసుకెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సమస్యలు పరిష్కరించాల్సిన సర్కారు అణచివేస్తుండడంపై విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ… చదువులేని విద్యాశాఖ మంత్రి వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయన్నారు. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement