Thursday, May 2, 2024

అక్రమంగా తాటిచెట్ల నరికివేత..

బెల్లంపల్లి : నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామంలో అక్రమంగా తాటిచెట్లను నరికివేశారు. నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామంలో గాజుల మల్లయ్య, నార భీమయ్య అనే వ్యక్తులు తాటిచెట్లను అక్రమంగా నరికివేశారని, అడ్డుకోబోయిన నెన్నెల గీత కార్మికులను అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇంకా మిగతా చెట్లను నరికివేస్తామి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసు సమాధానం చెప్పారని, ఈ ఘటనపై గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ చెన్నూరు ఎక్సైజ్‌ సీఐకి సమాచారం అందించినా స్పందించకపోవడంతో మంచిర్యాల సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement