Friday, May 3, 2024

కరోనా నిబంధనల మధ్య సీతారాముల కళ్యాణం..

బెల్లంపల్లి : ఈ నెల 21వ తేదిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని కోదండ రామాలయంలో అంకురార్పణ, ధ్వజారోహణతో పాటు ఎదురుకోలు కార్యక్రమాలను కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్‌ రేణికుంట్ల శ్రీనివాస్‌, డైరెక్టర్లు, కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. ప్రతి కార్యక్రమం ఆలయ అంతర్భాగంలో నిబంధనలు పాటిస్తూ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు ఎవరు ఆలయానికి రావద్దని అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీతారాముల కళ్యాణాన్ని పూజారులచే నిర్వహిస్తామని చెప్పారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement