Thursday, April 25, 2024

బొగ్గు ఉత్పత్తి..కరోనా నివారణపై సమీక్షా సమావేశం

శ్రీరాంపూర్‌ : ఏరియాలోని జీఎం కార్యాలయంలో డైరెక్టర్‌ పిఅండ్‌ పీపీ బలరాం శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయంలో ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై, కరోనా నివారణపై జీఎం సురేష్‌తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ శ్రీరాంపూర్‌ ఏరియా సింగరేణి వ్యాప్తంగా పెద్దదని, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ముందుంటుందని, శ్రీరాంపూర్‌ ఏరియాలో ఉద్యోగస్తులందరిని రక్షించేందుకు కరోనా పట్ల తీసుకుంటున్న నివారణ చర్యల గురించి జీఎంను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణలో కార్మికులకు కావాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుండాలని, అన్ని సదుపాయాలను కల్పించాలని డైరెక్టర్‌ బలరాం జీఎంకు తెలిపారు. ఉద్యోగులందరికి కావాల్సిన ముందులను తెప్పించుకొని ఉద్యోగస్తులకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం (ఐఅండ్‌పీఎం) రవిప్రసాద్‌, డీజీఎం (పర్సనల్‌) గోవిందరాజు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement